ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికలు త్వరలో జరగబోతున్న నేపథ్యంలో ..ప్రధాన పార్టీల రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారంలో చాలా బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా తెలుగుదేశం పార్టీ నాయకుడు కేశినేని నాని తన ప్రత్యర్థి వైసీపీ పార్టీ కి చెందిన రాబోతున్న ఎన్నికలలో విజయవాడ పార్లమెంటు నుండి పోటీ చేయబోతున్న ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ (Pvp) పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
సినిమా రంగంలో ఉంది ఇది చాలా మంది హీరోయిన్లను మరియు హీరోలను మోసం చేశారని...ఒక్క మహేష్ బాబు మేన చాలామంది అగ్ర హీరోలు Pvp చేతిలో మోసపోయారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా సౌత్ ఇండియా సూపర్ హీరో నటుడు కమల్ హాసన్ కుమార్తె శృతి హాసన్ ని వేధింపులకు గురి చేశారని కేశినేని నాని ఆరోపించారు. శృతిహాసన్ని బ్లాక్ మెయిల్ చేసి డేట్స్ తీసుకున్న పీవీపీ ఆమెను ఏడిపించాడని, శృతిహాసన్ తరహాలోనే మరింత మందిని బ్లాక్మెయిల్ చేశారని ఆరోపించారు.