మహానాడు ను రద్దు చేసుకున్న టిడిపి..!

Advertisement

by Siddhu Manchikanti | May 15, 2019 13:14 IST
Follow Xappie
మహానాడు ను రద్దు చేసుకున్న టిడిపి..!

మహానాడు ను రద్దు చేసుకున్న టిడిపి..!
 
తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కార్యక్రమం ఏదైనా ఉంది అంటే అది మహానాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం మే నెలాఖరులో నిర్వహిస్తూ ఉంటారు. అయితే తాజాగా ఈనెలాఖరులో జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ రద్దు చేసుకున్నట్లు సమాచారం. అయితే పార్టీ వ్యవస్థాపకుడు ఎన్.టి.ఆర్.జయంతిని ఘనంగా అన్ని గ్రామాలలో నిర్వహించాలని నిర్ణయించారు.
 
పార్టీ ముఖ్య నేతలతో పార్టీ అదినేత చంద్రబాబు నాయుడు చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. మే 23న ఎన్నికల ఫలితాలు రానుండడం, జాతీయ రాజకీయాలలో చంద్రబాబు బిజిగా ఉండబోతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నాయి. అయితే మరో పక్క విపక్ష పార్టీలు మాత్రం చంద్రబాబు నాయుడికి తాజాగా జరిగిన ఎన్నికల్లో ఓడిపోవడం తెలిసింది కాబట్టి మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించకుండా జాతీయ రాజకీయాలు అంటూ డ్రామాలు ఆడుతున్నారని సెటైర్లు వేస్తున్నారు.


Advertisement


Advertisement

Top